ఉదయమే కానీ శుభోదయం కాదు, సాంకేతిక పరిజ్ఞానం అంటూ ప్రకృతి తల్లికి చేసిన గాయలెన్నో, అమ్మ ఒడిలో ఉంటూ అందని చందమామ కోసం ఎన్నో ఆరాటాలు ,ఒడిలో లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మని కాదని కంటికి కనపడని గ్రహాల అన్వేషణలో కన్నతల్లికి చేసిన గాయలెన్నో,
ఎన్ని గాయాలు చేసిన అమ్మ మందలించిందే కానీ ఏనాడు దూరం చేయలేదు, కానీ ఈనాడు కరోనా అనే మహమ్మారి వల్ల ఒక వైపు కాలుష్యం తగ్గి జీవన వైవిధ్యం విరాజిల్లుతోంది మళ్లీ అని సంతోష పడాలో లేక తాను పెంచిన పిల్లలు తనువుచాలిస్తు ఉంటే ఆ తనువులు తనలో కలుపుకొలేని నిస్సహాయత తలచుకుని అవేదన చెందుతుంది.
ఇకనైనా పుడమి తల్లి ఆవేదన అర్థం చేసుకుని ఆమె అశ్రువులను ఆనందబాష్పాలు గా మలచాలని కాంక్షిస్తూ .
🙏
STAY HOME BE SAFE.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి